బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల

పశ్చిమగోదావరి జిల్లా, ఈనెల 28వ తేదీన జరగబోయే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రజలు వారి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసిన మనోహర్. రాబోయే రోజుల్లో అవినీతి వైసిపి పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వ్యూహాత్మ రచన చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగితేరిందని ఇటీవల కాలంలో కొనుగోలు చేసిన హెలిప్యాడ్ ల విషయంలో తేటతెల్లమయింది. 28వ తారీకు జరగబోయే భారీ బహిరంగ సభకు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా వచ్చి సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్, చేగొండి సూర్యప్రకాశ్, కనకరాజు సూరి, కె కె, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, విడవాడ రామచంద్రరావు, రెడ్డి అప్పలనాయుడు, మేక ఈశ్వరయ్య, చిర్రి బాలరాజు, డీవీవీ ప్రసాద్, పత్సమట్ల ధర్మరాజు, జుత్తిగ నాగరాజు, చనమల్ల చంద్రశేఖర్, కరాటం సాయి, ఇల్లా శ్రీనివాస్, చాగంటి మురళీకృష్ణ, నారా శేషు, వెంకటలక్ష్మి ఘంటసాల, కాట్నం విశాలి, జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.