కొప్పెర్ల గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పార్వతమ్మ ను దర్శించుకున్న శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, కొప్పెర్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పార్వతమ్మ అమ్మవారి జాతర సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం తమ సొంత ఖర్చులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 3000 మంది వరకు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా నియోజకవర్గ మరియు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి భక్తులు అందరికీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు దేవుడు ఇచ్చిన వారమని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు, ఆలయ సిబ్బందికి, జనసేన నాయకులు, జనసైనికులకు మరియు వీర మహిళలకు ఎల్లవేళలా అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.