కొత్తపల్లి గ్రామానికి జనసేన సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్

కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త దాకారపు కొండలు గత 5నెలలు క్రిందట రోడ్డు ప్రమాదంలో అకాల మరణానికి గురవడం జరిగింది. అయన జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వం తీసుకోవటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల(5,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయ నిమిత్తం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 13-9-2022(మంగళవారం)వ తేది మధ్యాహ్నం 1 గంటకు కొత్తపల్లి గ్రామానికి విచ్చేయుచున్నారు. కావున జిల్లా కార్యవర్గం, నియోజకవర్గం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముదినేపల్లి మండలం అధ్యక్షులు వీరంకి వెంకయ్య మరియు కొత్తపల్లి జనసైనికులు కోరడం జరిగింది.