నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో జగన్నాధపురం చిన్నమార్కెట్ ప్రాంతంలో జరిగింది. నాదెండ్ల మనోహర్ తవ్వుతున్న కొద్దీ పుట్టలు పుట్టలుగా వెలుగులోకి వస్తున్న అవినీతి చూస్తుంటే ఈ వై.సి.పి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాలలో విక్రమార్కుడిలా కనపడుతున్నాడన్నారు. వీళ్ళతీరు చూస్తుంటే అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నారా లేక తను దోచుకుని కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారా అనిపిస్తోందన్నారు. అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చూస్తారన్న స్పృహ ఉందా లేక నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. కనీసం మానవత్వం లేకుండా పిల్లల స్కూలు బ్యాగ్గుల్లోను వేసుకునే షూలలోను కూడా చేతివాటం తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, అక్షయ దుర్గాప్రసాద్, దొరబాబు, బస్వాని నాగబాబు, మందపాక దుర్గాప్రసాద్, ముల్లపూడి శివాజీ యాదవ్, మల్లాడి నంద కుమార్, వరిపల్లి ప్రసాద్, చోడిపల్లి సత్యవతి, దారపు శిరీష, రచ్చ ధనలక్ష్మి, తన చింతల రమ్య, చింత దుర్గ మరియు జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.