నాదెండ్ల మనోహర్ మైలవరం పర్యటన

  • విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అక్కల గాంధీ

మైలవరం, ఇటీవల ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు మేకల రాజా కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతుల మీదగా జనసేన పార్టీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ను అందజేయడం జరుగుతుందని, కావున మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు బుధవారం ఉదయం 9 గంటలకు తుమ్మలపాలెం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరు హాజరవ్వాల్సిందిగా కోరుచున్నామని మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామమోహనరావు(గాంధీ) పిలుపునివ్వడం జరిగింది.