బొలిశెట్టి నామినేషన్ ను విజయవంతం చేయండి: బొలిశెట్టి రాజేష్

ఘనంగా పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్

తాడేపల్లిగూడెం: ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం జరిగే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తనయులు బొలిశెట్టి రాజేష్ పిలుపునిచ్చారు. గురువారం పెంటపాడు గ్రామంలో ఏడవ రోజు పల్లెపోరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతి రాక్షస పాలన లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి కుంటుపడేలా చేసిన ఘనత సీఎం కు దక్కుతుందని జగన్ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. కస్పా పెంటపాడు వేణుగోపాలస్వామి గుడి వద్ద ఉదయం 9 గంటలకు స్వామి పూజల అనంతరం నామినేషన్ ర్యాలీ ప్రారంభమవుతుందని కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పెంటపాడు మండలం నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.