కనపర్తి మనోజ్ కుమార్ ని అభినందించిన నాగబాబు

  • నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబును ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మంగళవారం హైదరాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అత్యున్నతమైన విద్య ఎంబీఏ వరకు చదువుకొని సమాజంలో మార్పు రావాలి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లలో అభివృద్ధి జరగాలి అని కోరుకుంటూ, జనసేన పార్టీ స్థాపించింది మొదలు ఈరోజు వరకు అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కార మార్గాల కోసం కష్టపడుతూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంటూ, పార్టీకి వెన్నుదండుగా ఉంటూ.. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ చూచనలు సలహాలు తీసుకుంటూ ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటూ, ఎప్పటికప్పుడు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అన్ని సోషల్ మీడియాలో పార్టీ అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నటువంటి కనపర్తి మనోజ్ కుమార్ ని అభినందిస్తున్నాను, ఇటువంటి యువకులు జనసేన పార్టీలోకి రావాలి, సమాజంలో మార్పుని తీసుకుని రావాలి, అని కొణిదెల నాగబాబు తెలియజేశారు. మనోజ్ కుమార్ నాగబాబు గారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడి, పార్టీ యొక్క అభివృద్ధి గురించి దిశా నిర్దేశం సలహాలు సూచనలు నాకు నాగబాబు గారు ఇవ్వడం జరిగింది, నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు మరియు అభినందనలు రావడానికి ముఖ్య కారణం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ షేక్ రియాజ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీమతి రాయపాటి అరుణ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ చీకటి వంశీ దీప్ గారు మొదలైన వారు ముఖ్య కారణం. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని మనోజ్ కుమార్ తెలియజేశారు.