జనసైనికుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నాయుడు, శివ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: పీఏసీ సబ్యులు పంతం నానాజీ అనారోగ్యం నుంచీ త్వరగా కోలుకోవాలని కాకినాడ రూరల్ నియోజక వర్గం సర్పవరం జంక్షన్ నుండి జనసైనుకులు పాదయాత్రగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర దిగ్విజయంగా ముగించారు. పాదయాత్ర బెండపూడి గ్రామం ప్రవేశించగానే తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయుడు యాత్రకు సంఘీభావం తెలిపి వారితో యాత్ర కొనసాగించారు. పాదయాత్ర చేస్తూ వచ్చిన జనసైనికులు బెండపూడి గ్రామ అధ్యక్షుడు కోరుకొండ శివ ఆధ్వర్యంలో శీతల పానీయాలు అందించడం జరిగింది. తుని నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ బుసాల మణిబాబు బెండపూడి గ్రామ ఉపాధ్యక్షుడు గజ్జి ప్రభుదాస్, గ్రామ ట్రెజరర్ వుటా శివ దుర్గ, సోమిశెట్టి శివకుమార్, అయ్యప్ప మరియు మండల జనసైనీకులు యాత్రలో పాల్గొన్నారు.