దూసుకు పోతున్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం, గొడ్డెటి పాలెం శెట్టిబలిజ పేటలో స్థానిక జనసేన-టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ కాకినాడ రూరల్ కో-ఆర్డినేటర్ మాజీ శాసనభ్యులు శ్రీమతి & శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, కో కో-ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ మే 13 వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుఫై వేసి అఖండ మెజారిటితో గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా గ్రామంలోని ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, ప్రచారం నిర్వహించారు. రాబోయే జనసేన-టీడీపీ-బిజేపి ఉమ్మడి ప్రభుత్వంలో మౌళిక వసతులు కల్పిస్తామని, మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని, యువతకి ఉద్యోగాలు కల్పనకు కృషి చేస్తామని, మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, దేవు వెంకన్న, గంజా రాంబాబు, నక్క రాజబాబు, వాసంశెట్టి సూర్యనారాయణ, వాసంశెట్టి ఉమా, వాసంశెట్టి సురేష్, వాసంశెట్టి విష్ణు, బీజేపీ, జనసేన నాయకులు, స్థానిక జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.