చేగొండి సూర్య ప్రకాష్ పై ధ్వజమెత్తిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ గంగరాజు నగర్ రోడ్ నెం.1 లో గల కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నాయకులతో కలిసి ఖండించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చేగొండి సూర్య ప్రకాశరావు గతంలో వైసిపిపై మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి అని,
దొంగలే జైలు పక్షుల పార్టీలోకి వెళ్తారని, వెళ్లినవారు కూడా దొంగలే అని అన్నావు. నేను దొంగ అని తెలిసిన తర్వాతే ఆపార్టీలోకి వెళ్ళినట్లుగా ఉంది మీ వ్యవహారం. మా పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు. నీలాంటి కోవర్టులు ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తిడితేనే పార్టీలో పదవి వస్తుందని మీ ఆలోచన, మీరు వైసీపీలోకి రెండు కారణాలతో వెళ్ళి ఉండాలి. ఒకటి సీటు కోసం, రెండవది డబ్బులు కోసం, సీటు మీకు ఎలాగూ ఇవ్వరు. ఇక రెండో విషయం సంగతి అనేది మీరు అందరికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి? మీ నాన్న రికమండేషన్ తోనే మీకు పిఎసిలో చోటు దక్కింది, అది మర్చి పోవద్దు. మీ నాన్న హరి రామ జోగయ్య మీ ఐడెంటిటి, వారు లేకపోతే మీరు జీరో.
పార్టీలో క్రమశిక్షణగా మెలిగేలా చేసే హక్కు అధ్యక్షునికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ పై అవాకులు, చవాకులు మరొకసారి పేలితే గౌరవంగా ఉండదు. మాలాంటి జనసైనికులు వీర మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఓడిపోయే పార్టీలోకి వెళ్ళటం సంతోషకరం. పవన్ కళ్యాణ్ ని చూస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగ కూడా వణికిపోతున్నాడు. మీరు జనసేన పార్టీ కి ఏవిధంగా కూడా అభివృద్ధి చేసింది లేదు. మీరు వైసిపి లోకి ఏ ఉద్దేశంతో వెళ్లారు ప్రజలకు తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, బండారు మురళి, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, తాటికాయల వీరబాబు, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీనివాస్, సింహాద్రి, గవర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.