కొణిదల విజయం కొట్టే లక్ష్యం

నెల్లూరు, కొణిదల విజయం కొట్టే లక్ష్యం అంటూ నెల్లూరు సిటీలో ప్రారంభమైన జనసేన తెలుగుదేశం ప్రచార రథాల యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నెల్లూరు జిల్లా నుంచి వెళ్లి అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్రగామిగా నిలిచిన కొట్టే ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచార నిర్వహించేందుకై ఏర్పాటు చేసిన 25 ప్రచార రథాలను నెల్లూరు సిటీ మూడో డివిజన్ డిజిపి కళ్యాణమండపం పక్కన గల వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూజ చేసి లాంఛనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సిటీ పట్టణ అధ్యక్షుడు మామిడాల మధు జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు ఏటూరి రవికుమార్, హర గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరం నాలుగు వైపులా ఏ సందును అడిగినా అభివృద్ధికి కారణం నారాయణ అంటూ తెలుపుతారు. నెల్లూరు సిటీలో జనసేన నాయకులు వేములపాటి అజయ్ సూచనలతో పనిచేసే పొంగూరు నారాయణని గెలిపించేందుకు జనసేన నాయకులందరూ సిద్ధమని తెలిపారు. చిన్నపిల్లాడ్ని అడిగినా ఈరోజు సిటీలో గెలిచేది నారాయణ అని చెప్పారు. ఇటువంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలకు కట్టుబడి సీట్ల ఎంపికను చేసిన పవన్ కళ్యాణ్ నిర్ణయానికి జనసేన పార్టీ వారందరూ కట్టబడి ఉన్న కట్టుబడి ఉన్నారు, వారి నిర్ణయం మేరకు పొంగూరు నారాయణని గెలిపించుకొని తీరుతామని తెలిపారు. వైయస్ఆర్సీపీ 2019లో నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన అభివృద్ధి ఎక్కడకక్కడే నిలిచిపోయిందని నారాయణని గెలిపించి అభివృద్ధి పథంలో నెల్లూరు నడిపించాలని కోరారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అగ్రగామిగా నిలిచిన కొట్టే ఉదయ భాస్కర్ సొంత రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహాయంగా ఈ ప్రచార రదాలను ప్రారంభించడం అభినందనీయమని ఆయన లక్ష్యం నెరవేరి ప్రజాప్రభుత్వం ఏర్పడి కొణిదల పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబునాయుడు అద్భుతమైన మెజారిటీతో గెలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సిటీ అధ్యక్షుడు మామిడాల మధు, హరగోపాల్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి, జనసేన సీనియర్ నాయకుడు రవికుమార్, శేఖర్ రెడ్డి, వీర మహిళలు కృష్ణవేణి, నాగరత్నం, కస్తూరి, హసీనా, రేణుక, రాధమ్మ, నిర్మల, నందిని, జనసేన నాయకులు సూరి, శీను శరవణ, హేమచంద్ర యాదవ్, ప్రసన్న, వర, బన్నీ, ప్రశాంత్ గౌడ్, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.