జనసైనికుని కుటుంబానికి భద్రత కల్పించాలని కోరిన పంతం నానాజి

కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం తూరంగి గ్రామంలోని 3వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మంత్రి బాబాస్వామి ఇంటిపై వైసీపీ నాయకుల దౌర్జన్యం. జనసైనికుని షాపులో ఇంజన్ దొంగతనం చేస్తూ పట్టుబడిన వైసీపీ కార్యకర్త. అతని దొంగతనాన్ని ప్రశ్నించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నామని కక్షతో అర్ధరాత్రి ఇంటి గోడ దూకి అందుబాటులో ఉన్న బైక్ పై పెట్రోలు పోసి నిప్పంటించిన వైసీపీ నాయకుల అనుచరులు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకుని వెంటనే తూరంగిలోని బాధితుని గృహానికి వెళ్లి పరిస్థితుల్ని పరిశీలించి పోలీస్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని, స్థానిక జనసేన నాయకులతో కలిసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ అధికారులను సంప్రదించి ఎప్.ఐ.ఆర్ ఫైల్ చేయాలని కోరిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.