నందికొట్కూరు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదల పాలిటి కన్నీళ్లు

నందికొట్కూరు: జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అనే కార్యక్రమం నందికొట్కూరు నియోజకవర్గం లోని పగిడ్యల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి నల్లమల రవికుమార్, బోరెల్లి వెంకటేశ్, కాకర్ల కిరణ్, కర్నాటి మల్లికార్జున తదితరులు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాలుగు గ్రామాలకు కలిపే ఒకే చోట జగనన్న గృహాలు ఇవ్వడం జరిగింది. కానీ కనీసం 5 శాతం గృహాలు కూడా పూర్తి కాలేదు. చాలా మంది ప్రజలు కట్టించుకోలేని పరిస్థితి ఉండడంతో వారికి మంజూరైన గృహాలు ప్రభుత్వం రిటర్న్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చేది 1,80,000 రూపాయల మెటీరియల్ ప్లస్ నగదు. ప్రభుత్వము గృహాలు మంజూరు చేసింది పేద ప్రజల కొరకు వారు ఈ లక్షా ఎనభై వేల రూపాయలతో ఎలా గృహాన్ని పూర్తి చేస్తారు?
మంజూరైనటువంటి గృహాలు ప్రభుత్వం రిటర్న్ తీసుకున్న వారికి తిరిగి వారికి ఇవ్వాలని నందికొట్కూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫునుండి డిమాండ్ చేయడం జరిగింది.