తిప్పన దుర్యోధన రెడ్డి ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలం, బాలకృష్ణ పురం గ్రామంలో ప్రభుత్వం అందచేసిన జగనన్న ఇళ్ల స్థలాలను జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేశామని, అందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 50 శాతం ఇళ్లను పూర్తిచేశామని చెబుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.చాలాచోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదని కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెబుతున్నారని అన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇలాంటి దోపిడీ దొంగలకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియచేస్తున్నాను ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో శ్యామ్, జోగారావు, దుర్యోధన ఏకంబర్, రాము తదితరులు పాల్గొన్నారు.