సిఎం ఇంటి ముందు ఉండే పది కుక్కల్లో పేర్ని నాని కూడా ఒక కాపలా కుక్క

  • పేర్ని నానికి కుటుంబంలో, సొంత ఊరు, సొంత పార్టీలోనే విలువలేదు.
  • పేర్ని నానికి కుక్క బిస్కెట్ వేసి వాడుకొని వదిలేశారు.
  • రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం జనసేనపై విమర్శలు చేస్తున్నాడు.
  • మేము ప్రత్యేక హోదా తెస్తే… మీ ఎమ్మెల్యేలు, ఎంపిలు మా ఇంట్లో పాచి పనిచేస్తారా?
  • చేతగాని వాళ్లమని అంగీకరించండి. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం బిజెపితో మాట్లాడుతారు.
  • వైసిపి పార్టీలో మాత్రమే రైతున్నాడు, మీ గుండెల్లో కాదు.
  • రైతులకు సొంత డబ్బుతో మేలు చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.
  • జనసేన కు వస్తున్న జనాదరణను చూసి తాడేపల్లిలో తడిచి పోతుంది

తిరుపతి, నానీ మీకు మీ ఇంట్లో, మీ ఊర్లో, మీరు భజన చేసే మీ పార్టీలోనే విలువ లేదు మీరు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం హాస్యాస్పదం. 151 సీట్లు ఉన్నాయని అహంకారంతో ఉన్న మీకు రేపు రాబోయే ఎలక్షన్లలో జనసేన మిమ్మల్ని 15 సీట్లకే పరిమితం చేయబోతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిన్న పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు దీటుగా జనసేన నాయకులు జిల్లా అధ్యక్షులు డా.హరి ప్రసాద్ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, మరియు రాష్ట్ర జిల్లా నాయకులు పగడాల మురళి, ఆకేపాటి సుభాషిని, మునస్వామి, కీర్తన, లక్ష్మి, అమృత, పార్థు, కిషోర్, లోకేష్, మనోజ్ తదితరులు సోమవారం ఓ ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ మీరు చేయలేనిది అధినేత పవన్ కళ్యాణ్ కష్టార్జితంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తుంటే చూసి సహించలేక మా నాయకుడిపై కుట్ర బుద్ధితో విమర్శలు చేస్తారా, మాజీ మంత్రి నానిని ఒకటే అడుగుతున్నాం అసలు మీకు విలువలు ఉన్నాయా మీకు మీ ఇంట్లో విలువ లేదు, నువ్వు భజన చేస్తున్న మీ పార్టీలో కూడా విలువ లేదు, విలువ లేని మనిషి నువ్వు నీ గురించి మాట్లాడడం మా కర్మ, గతంలో జగన్ మోహన్ రెడ్డి వేసిన కుక్క బిస్కెట్లు తిని మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే నీకు మంత్రి పదవి పోయింది. అన్న విషయాన్ని మరిచిపోతున్నారు, రేపు రాబోయే రోజుల్లో మీకు టికెట్ రావాలని మళ్లీ మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు. ఈసారి మీకు టికెట్ కూడా రాదు అని పొత్తుల గురించి నిన్ననే మా నాయకులు క్లారిటీ ఇచ్చారని ప్రతి సారి మీరు సింగల్ గా రండి సింగల్ గా రండి మేము సింహం సింగిల్ గా వస్తుంది అని అంటున్నారు. ఈసారి మీ సింహాన్ని ప్రజలు బోనులో పెడతారు అని రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం మిలా ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియాలలో సంపాదించిన డబ్బులు కాకుండా సొంత నిధులతో రైతులకు సహాయం చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి అని మమ్మల్ని ప్రత్యేకహోదా తీసుకొని రావాలని ఆయన అంటున్నారు మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు ఏం చేస్తారు మా ఇళ్ళల్లో పాచి పని చేస్తారా అని అన్నారు.
అదేవిధంగా 2014లో స్పెషల్ స్టేటస్ కోసం మోడీ గారికి ఎదురుతిరిగిన ఒకే ఒక నాయకుడు మా నాయకుడు అని మాట తప్పడు మడమ ఇప్పుడు అని ఎంత మంది ఎంపీలు ఉన్నప్పటికీ మీరు ఏం చేశారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే వారికి బాటిల్ రూపంలో గోల్డ్ మెడల్ రూపంలో ప్రెసిడెంట్ మెడల్ అనే దాని అర్థం కూడా తెలియకుండా యువతకు అందిస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదు అని పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారని, భవన కార్మికుల వైపు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని యువతకు అండగా నిలబడి నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఒక్కరేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు, బకాసురుడు లాంటి జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర పేరుతో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారని మా నాయకుడు ప్రజలకు దత్త పుత్రుడు అని రేపు రాబోయే ఎలక్షన్లలో మీయొక్క 151 సీట్లు 15 సీట్లు జనసేన పార్టీ పరిమితం చేయబోతోందని జోస్యం చెప్పారు.