ములకలపల్లి మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాలూరి ఆదేశాల మేరకు.. తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ దుంపటి శ్రీనివాస్ సూచనల మేరకు.. జనసేన పార్టీ ముఖ్య నాయకులు తాటికొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగల రామచంద్ర రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బాకీ సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరికె రాంబాబు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు కోడిమే వంశీ, గొల్ల వీరభద్రం మరియు అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ దమ్మపేట మండలం వార్డు మెంబర్ యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎస్ కే రెహమాన్ ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.