నరసాపురం జనసేనలో భారీ చేరికలు

నరసాపురం: జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలు.. బొమ్మిడి నాయకర్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై అత్యధిక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి శెట్టిబలిజ నాయకుడు, ఎల్ బి చర్ల గ్రామ మాజీ ఉపాధ్యక్షులు గుబ్బల మార్రాజు వారి అనుచరులు దాదాపుగా 50 మంది శెట్టిబలిజ సోదరులు వైసీపీ నుండి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీ లో చేరిన వారిలో గుత్తులు శ్రీనివాసు, దొంగ వేంకటపతి, గుబ్బల సత్యనారాయణ, కడలి శ్రీనివాసరావు, గుత్తులు నాగ మల్లేశ్వర రావు, గుత్తులు వెంకటేశ్వర రావు, గుత్తులు శ్రీకృష్ణ, పీతాని శ్రీను, జక్కంశెట్టి మోహన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్ర, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, ఇంజేటి దానం, బొక్కా చంటి, కటకంశెట్టి సంజీవరావు, తోట నాని, బళ్ల హనుమంతు, కడలి పద్మారావు, చామకూరి సుబ్రమణ్యం, మట్ల సూర్య, కటకంశెట్టి సాయి, కటకంశెట్టి రామకృష్ణ, కటకంశెట్టి శుభాకర్ తదితరులు పాల్గొన్నారు.