జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: రాధారం రాజలింగం

హైదరాబాద్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొంతమంది రెక్కీ నిర్వహించడంపై కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ జనసేన ముఖ్య నాయకులతో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం సమావేశం నిర్వహించి గ్రేటర్ జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి శిరీష మరియు గ్రేటర్ జనసేన ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.