అంబికా లక్ష్మీనారాయణను కలసిన నార్పల జనసేన నాయకులు

శింగనమల, జనసేన-తెలుగుదేశం-బీజేపీ అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆత్మీయ సమావేశం సందర్బంగా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను నార్పల మండల జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కక్ష పూరితంగా జైల్లో పెట్టారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను ఉన్నానంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడం ఎంతో సంతోషం అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ తో కలసి అనంతపురం పార్లమెంట్ ఆభివృద్దికి శక్తివంచన లేకుండా పని చేస్తామని అన్నారు. నార్పల జనసేన నాయకులతో ప్రతేకంగా సమావేశమైన అంబికా లక్షనారాయన వచ్చే ఎన్నికల్లో కస్టపడి పని చేయాలని, వచ్చేది ప్రజా ప్రభుత్వమేనన్నారు. కూటమిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసమే అని, జగన్ ని గద్దె దించితే గాని మన బ్రతుకులు మారవన్నారు. సిద్ధం అంటున్న జగన్ మోహన్ రెడ్డికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలసి జనసేన శ్రేణులు వైసీపీ దుష్ట పాలనపై యుద్ధం చేయాలని ప్రతిఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, పొన్నతోట రామయ్య, వినోదం నారాయణస్వామి, సిద్దరాచెర్ల హరినాథ్, శివ మోహన్, వినోదం లోకేష్, చామలూరు విజయ్, నరసింహ మరియు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.