రైతుల ఆత్మహత్యలు లేని సమాజాన్ని తీసుకురావడమే జనసేన ఆకాంక్ష: గౌతమ్ కుమార్

  • ఉరవకొండ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

ఉరవకొండ: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉరవకొండ జనసేన నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు & రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు సూచనతో ఉరవకొండ నియోజకవర్గం, ఉరవకొండ పరిధిలోని గ్రామాలలో పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలుకరించి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రైతుల బాధలు చెప్పడం వర్ణనాతీతమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మరింత అన్యాయం జరుగుతోందని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూడా వైసీపీ నాయకుల అవినీతిని కళ్ళారా చూస్తున్న పరిస్థితి అన్నారు. గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతు భరోసా 12500 రూ. ఇస్తామని చెప్పి రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. తీరా రైతులను మోసం చేస్తూ కేంద్రం ఇచ్చే పీ.ఎం కిసాన్ 6000 రూ. కలిపి ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని, ఇది ముమ్మటికీ రైతులను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర గురించి వివరించి, 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని తెలియజేశారు.. కడుపు నింపే రైతన్నల కంట కన్నీరు కారని, లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే కౌలు రైతుల ఆత్మహత్యల వార్తలు లేని సమాజాన్ని తీసుకురావాలని జనసేన పార్టీ తరపున ఆకాంక్షిస్తూ రైతు సోదర, సోదరీమణులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్, దేవేంద్ర, రమేష్, తిలక్, ముని కుమార్, బోగేశ్, కుమార్, రూపేష్, జనసైనికులు పాల్గొనడం జరిగింది.