ఎన్ని రాజు ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

రాజాం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాజాం జనసేన నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా సంతకవిటి మండలం, పోనుగుటివలస గ్రామం సమీపంలోని పంట పొలాలను సందర్శించి, రైతుల యొక్క కష్ట, నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌలు రైతులను సన్మానించి, రైతు కూలీలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ జనసేన పార్టీ రైతుల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తుందని. అలాగే ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని, ప్రతి మండలానికీ ఒక్క గిడ్డంగుని ఏర్పాటు చేయాలని, డీజిల్, పెట్రోల్ మీద ప్రత్యేకంగా సబ్సిడీ ఇవ్వాలని, సాగు యంత్రాలపై వ్యక్తిగత సబ్సిడీని ఇవ్వాలి.. అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.