జాతీయ రైతు దినోత్సవం.. రైతులతో కదిరి జనసేన

కదిరి: రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం, కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ సూచనల మేరకు, రైతులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను తెలుసుకోవాలనే పార్టీ పిలుపుతో కదిరి జనసేన నాయకులు శనివారం కదిరి నియోజకవర్గం, తలుపుల మండల పరిదిలోని రైతుల వద్దకు వెళ్ళి ఆ రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు భరోసా ద్వారా ఇస్తున్న 13500 తాము పంటలు పండించుకోవడానికి ఏ మాత్రం సరిపోలేదని, అకాల వర్షాల కారణంగా పండించిన పంట చేతికి అందడం లేదని, ఒకవేళ చేతికి వచ్చినా పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరి బాబు, నరసింహులు, గణేష్, అన్నం జయ వర్ధన్ పాల్గొనటం జరిగింది.