నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని గాజువాక జనసేన డిమాండ్

గాజువాక, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను, కరెంటు కోతలు ఆపాలని నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గం రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.