పరిగి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును ప్రజలకు 30 కోట్ల రూపాయలు పంచిపెట్టారన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు తన సొంత డబ్బును పంచిన దాఖలాలు లేవు అని రైతులకు తెలియజేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నం పెట్టే రైతన్న కడుపు కొడుతున్నాడు. మూడు ఎకరాల పొలం ఉన్న రైతులకు సబ్సిడీ రేషన్ రాకుండా రేషన్ కార్డులు తొలగించడం దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, ఉదయ్, నరసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.