తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

తాడేపల్లిగూడెం, రైతులు పడే కష్టం చూస్తుంటే ఈ అధికార వైసీపీ ప్రభుత్వం రైతన్నలకు తీరని ద్రోహం చేస్తుంది కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ధాన్యం అమ్ముకోవాలంటే 10 – 15 ఆఫీస్ లు చుట్టూ అధికారులు చుట్టూ తిరగాలి. ధాన్యాగారం అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులకు సరైన ఆదరణ లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ళలో రైతులను అనేక విధాలుగా కన్నీరు పెట్టించిన దుర్మార్గపు ప్రభుత్వం. అలాగే భారతదేశ చరిత్రలో ఏ అధికారం లేకపోయినా రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతులకు అండగా నిలబడి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 30 కోట్లు సహాయం చేస్తూ కౌలు రైతు కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలబడుతున్నారు అలాంటి జనసేన పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని అలాగే రైతన్నలకు జరుగుతున్న అన్యాయం పై జనసేనపార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది రైతులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని శుక్రవారం జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ రైతన్నలకు చిరు సత్కారం చేసి రైతన్నలందరికి శుభాకాంక్షలు తెలిపారు.