తుఫాను బాధితులకు నాయకర్ భరోసా

నర్సాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, ముత్యాలపల్లి గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వారి కుటుంబాలకు నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ మరియు జనసేన పార్టీ మత్స్యకార విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.