బోనకల్ శాంతి నిలయంలో నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

మధిర: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాము తాళ్లూరి రాము సూచన మేరకు జనసేన పార్టీ మధిర నియోజకవర్గఒ నాయకులు తాళ్లురి డేవిడ్ ఆధ్వర్యంలో, మండల నాయకులు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించదం జరిగింది. కార్యక్రమంలో బాఘంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాళ్లురి డేవిడ్ మాట్లాడుతూ పార్టీ స్థాపన నుండి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెన్నెంటే ఉంటూ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, పార్టీ బలోపేతం గురించి అహర్నిశలు కష్టపడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తూ, జనసైనికులకు ఆదర్శంగా నిలుస్తూ.. వారి నాయకత్వంలో 2024లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం జరిగితీరుతుంది, అదేవిధంగా మధిర నియోజకవర్గంలో ఐదు మండలాల జనసైనికులు పార్టీ బలపేతం చేయడానికి ఎన్ని ఒడిదుడుకు ఎదురైనప్పటికీ పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్తూ 2024లో మధిర నియోజకవర్గంలో జనసేన సత్తా చూపించడానికి, 2024 మధిర జనసేన అడ్డాగా చూపగలిగే దమ్ము ధైర్యం మధిర నియోజకవర్గఒ జనసైనికులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వింగ్ నాయకులు గంధం ఆనంద్, బోనకల్ మండల నాయకులు ఎస్కే జానీ, బాషా, మండల నాయకులు లక్కి శెట్టి సాయికుమార్, ఎస్ కే బాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.