గురుపౌర్ణమి వేడుకలలో పాల్గొన్న నేరేళ్ల సురేష్

గుంటూరు: గురుపౌర్ణమి సందర్భంగా సోమవారం గుంటూరు నగరంలో 2 డివిజన్ నందు శ్రీ వెంకట నాగ సాయి మందిరం నందు సాయిబాబా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ల సురేష్ పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బాబావారి పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది.