సమంత హోస్టుగా కొత్త టాక్ షో

సమంత అక్కినేని లాక్ డౌన్ ని ఉపయోగించుకున్నంత ఎవరూ ఉపయోగించుకోలేదేమో. రూఫ్ టాప్ గార్డెనింగ్ దగ్గరనుండి కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం వరకూ సమంత కొత్త సంగతులు చాలా ట్రై చేసింది. సమంత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆమె నెగటివ్ రోల్ పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

ఇక ఇటీవలే సమంత హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ ను తన అబ్సెన్స్ లో సమంత దసరా స్పెషల్ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

కాగా, రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం సమంత ఒక సెలెబ్రిటీ టాక్ షో ను నిర్వహిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. సామ్ జామ్ పేరుతో ఈ సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహించనున్నారు. ఇందులో సమంతకు అత్యంత సన్నిహితుడు, టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ సహాయకుడిగా ఉంటాడు. ఈ షో లో సినీ ప్రముఖులు తమ మనసులో భావాలు ఆమెతో పంచుకుంటారు. ఈ షో కు చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, తమన్నా, సైనా నెహ్వాల్ వంటి వారు పాల్గొంటున్నారు. ఈ టాక్ షో ను నవంబర్ 13 నుండి ప్రీమియర్ కానుంది. గతంలో మంచు లక్ష్మి చేసిన టాక్ షోలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో సమంత షో కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. ఒక స్టార్ హీరోయిన్ హోస్ట్‌గా మారి చేస్తున్న టాక్ షో కావడంతో ప్రేక్షకుల్లో కూడా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.