షిర్డీలో నైట్ కర్ఫ్యూ.. బాబా దర్శన వేళల్లో మార్పు

షిర్డీ: ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయిబాబా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సాయిబాబా దర్శనం ఉంటుందని అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు పేర్కొన్నది. కోవిడ్ మహమ్మారి వేళ ఏడు నెలల బ్రేక్ తర్వాత ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.