తిరుపతి పర్యటనలో నిమ్మగడ్డ.. ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడే స్పీడ్ పెంచారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారాయన. ఇందులోభాగంగా ఈ రోజు తిరుపతిలో మధ్యాహ్నం 3గంటలకు పొలిటికల్ పార్టీలతో భేటీకానున్నారు. ఆ తర్వాత కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతోనూ నిమ్మగడ్డ సమావేశం కానున్నారు.

రేపు విజయవాడ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి.. ఎల్లుండి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అధికారులతో నిమ్మగడ్డ భేటీకానున్నారు. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడాలని.. అలాగే పంచాయతీ ఎన్నికల తరహాలోనే విజయవంతం చేయాలని సూచించనున్నారు. ఈసారి కూడా వెబ్‌క్యాస్టింగ్‌, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు.