నొ మై కాన్స్టిట్యూఎన్సీ: రాజుల పాళెము పంచాయతీలో వినుత కోటా పర్యటన

శ్రీకాళహస్తి నియోజకవర్గం: నొ మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆదివారం ఏర్పేడు మండలం, రాజుల పాళెము పంచాయతీలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పర్యటనలో భాగంగా ప్రధానంగా ప్రభుత్వం నుండి కట్టిస్తామన్న ఇళ్లు 2 సంవత్సరాలు దాటినా.. కాంట్రాక్టర్లకు అప్పగించి మొండి గోడలు స్థాయిలో అసంపూర్తిగా ఉంది, సచివాలయం బిల్డింగ్ అసంపూర్తిగా ఉంది, రైతు బరోసా కేంద్రం అసంపూర్తిగా ఉంది, డ్రైనేజీ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, సమస్యలను జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ తరఫున ప్రయత్నిస్తామని గ్రామస్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు నితీష్ కుమార్, గురు ప్రసాద్, పవన్, బాలాజీ, వెంకటరమణ, చంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.