సర్వేపల్లిలో 8వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలోని సాయిబాబా కాలనీ నందు ఆదివారం 8వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సాయిబాబా కాలనీలో కనీస వసతులు లేనటువంటి పరిస్థితి. పంచాయతీలకు వచ్చే నిధులు ఎటు పోతున్నాయో తెలియదు గానీ, పంచాయతీలలో అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దారి మళ్లిస్తుండడం దారుణం. చివరికి పంచాయతీలకు కేటాయించే నిధులను సైతం వదలని వైసిపి ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలైన కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ముత్తుకూరు మండల నాయకులు రహీం భాయ్, అక్బర్, నవీన్, శ్రీహరి, రహమాన్, రాజేష్, దుర్గ, మల్లి తదితరులు పాల్గొన్నారు.