జనసేన కోసం ప్రాణాలు పోయినా పర్లేదు: పవన్ కుమార్ రాయల్

పలమనేరు: జనసేన పార్టీ పై సిఎం జగన్ రెడ్డి ఇటీవల నర్సాపురంలో జరిగిన సభలో రౌడీ సేన అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ విదితమే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పలమనేరు నియోజకవర్గం, పెద్ద పంజణీ మండల సంయుక్త కార్యదర్శి పవన్ కుమార్ రాయల్ వీడియో పొస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంగా వైసీపీ నాయకుల నుండి పవన్ కుమార్ కు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. వైసీపీ నాయకులు కాల్స్ చేసి భయపెట్టాలని చూశారు. ఈ విషయంపై పవన్ కుమార్ రాయల్ స్పందిస్తూ.. వారికి ఎట్టి పరిస్థితిలో భయపడే ప్రసక్తి లేదని.. జనసేన కోసం ప్రాణాలు పోయినా పర్లేదు అని స్పష్టం చేశారు.