ముత్తుకూరు జనసేన మండల కార్యాలయ ప్రారంభోత్సవం

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో సోమవారం మండల నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మూడు సంవత్సరాల నుంచి అధికారపక్షంలో ఉంటూ.. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా.. మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గురించి, వ్యవసాయం గురించి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా.. చిత్రంగా.. ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటపాలెం పంచాయతీలో భూగర్భజలాలను అధికార పార్టీ నాయకులు అక్రమంగా రెబల్ తవ్వకాలు తవ్వి, ఆయిల్ కంపెనీలకు అమ్ముకుంటుంటే నోరుమెదపని మంత్రి.. మీరు చేసిన అభివృద్ధి చూస్తే గుండుసున్నా.. అటువంటి మీరు మా అధ్యక్షులుకి వ్యవసాయం గురించి తెలియదు అని మాట్లాడతారా.. వ్యవసాయం గురించి తెలియకపోవచ్చు మీ దృష్టిలో కానీ రైతు కన్నీరు పెడుతుంటే చూస్తూ.. ఊరుకునే వ్యక్తి అయితే కాదు. ఈ రోజు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్లకి సహాయం చేయకపోగా కనీసం వారిని ఓదార్చిన పరిస్థితులు కూడా మీ అధ్యక్షుడుకి లేవు మరి మీరు కూడా మాట్లాడతారా దయచేసి ముందు సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసి తర్వాత మాట్లాడండి. జనసేన పార్టీ ముత్తుకూరు మండలంలో ప్రజా సమస్యలపై పోరాటం కోసం ప్రజల సమస్యలను తీర్చడం కోసం సోమవారం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అదే విధంగా నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి సుజయ్ బాబు, ముత్తుకూరు మండల అధ్యక్షులు గణపతి ముత్తుకూరు, మండలం సీనియర్ నాయకులు రహమాన్ భాయ్, నాగరాజు, వీరబాబు, అశోక్, సందీప్, పవన్, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.