జనసేనానిని విమర్శించే అర్హత వైసీపీలో ఏ ఒక్కరికి లేదు: బాల్యం రాజేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువశక్తి కార్యక్రమం ఎంతో విజయవంతం అయిన సందర్భంగా ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శించే అర్హత లేదు. ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు ఎన్నికల్లో ఎక్కడ ఓటమిపాలవుతారో అనే భయంతో పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. యువశక్తి కార్యక్రమం ద్వారా వంద మంది యువతి యువకులు వాళ్ల స్థానికంగా ఉండే సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి అలాగే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువచ్చి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అందరికీ అర్థమయ్యే విధంగా యువశక్తి కార్యక్రమం ద్వారా నిరూపితం అయింది. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. సినిమాల ద్వారా రోజుకి కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అవన్నీ వదులుకొని ప్రజలకి మంచిచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వచ్చే 2024 ఎన్నికల్లో ఎక్కడ ప్రజలు అవగాహన ఏర్పడి వైసిపి పార్టీకి ఓటు వేయరని భయం పట్టుకొని జనసేన పార్టీని ఎలాగైనా అణగదొక్కాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అరకొరగా సంక్షేమపథకాలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే సమస్యలు లేవు అన్నట్లు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు వైసీపీ వాళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా లేవు ఈ వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ శాఖలో ఏమి ఉంటాయో కూడా తెలియని మంత్రులు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటమే గాని ఆ శాఖకు సంబంధించి అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేదు. వైసిపి మంత్రులకు ఏదైనా సమస్యలు చెప్పుకుంటే వారిపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సామాన్య ప్రజల పైన ఎంతసేపు సింగిల్ గా పోటీ చేస్తాం మేము అని అనటమే గాని ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు మద్యం ఇవ్వము అనేమాటే మాట్లాడరు వైసిపి నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల్లో మొదటి స్థానం అభివృద్ధితో లాస్ట్ స్థానం తీసుకొని వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా ప్రభుత్వం స్థాపించి ప్రజలకు మంచి పరిపాలన అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.