జిల్లా కేంద్రంగా రాజమండ్రి వద్దు… కాకినాడే ముద్దు

జిల్లాల పునర్విభజన ప్రక్రియలో అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కాకుండా కాకినాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలో ఉంచాలనే డిమాండ్ తో మండల‌ కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న పెదపూడి మండలం ప్రెస్ క్లబ్ వారికి సంఘీభావం తెలిపి అనంతరం పెదపూడి ఎం.ఆర్.ఓ మరియు ఎం.డి.ఓ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు & మండల ప్రెసిడెంట్ నాగిరెడ్డి వీరాస్వామి, జనసేన నాయకులు ఆర్.నాగు వీరమహిళ కాశీరాణి, సంపర ఎంపిటిసి ఎరుబండి శ్రీ రామచంద్ర మూర్తి మరియు మండల జనసైనికులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. జిల్లా కేంద్రంగా రాజమండ్రి వద్దు… కాకినాడే ముద్దు అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోడాబత్తుల రామకృష్ణ, ఉంగరాల రాధాకృష్ణ, తోటకూర గణపతి, కొటికలపూడి సీతారామయ్య, యడ్లపల్లి వీరసాయికృష్ణ, సుంకర బుజ్జి, అడబాల బుజ్జి,అమరాది రవి, రాధకృష్ణ, ప్రవీణ్, అశోక్, వై.రాజు, మట్టా రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.