కాకినాడ జనసేనలో చేరికలు

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జనసేన పార్టీలో పలువురు చేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం టీడీపీ కార్యకర్తలు సుమారు 50 మంది టీడీపీ నాయకులు తాటిమల్ల రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. కానూరి కిరణ్, తిప్పని సామ్యులు, ఎర్రం సాయికుమార్, వళ్లు రాజేష్, వేముల సంతోష్, పెద్దపూడి అయ్యప్ప, తిప్పని చిన్న, పులిగడ్డ నాగేంద్ర, గుబ్బల వీరబాబు తదితరులు ఇంద్రపాలెం జనసేన నాయకులు గవర శ్రీరామ్, దొడ్డి పట్ల అప్పారావు, సూతి శ్రీనివాస్, మండల అధ్యక్ష్యలు కరెడ్ల గోవింద్ నాయకత్వంలో నేడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికి జనసేన పార్టీ కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి పంతం నానాజీ ఆహ్వానించారు.