ఎన్టీఆర్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి: జనసేన డిమాండ్

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు వైద్యులు అందుబాటులో లేక పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నందున.. జనసేన పార్టీ తరఫున మంగళవారం సూపరింటెండెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సీటీ స్కాన్ అందుబాటులో లేకపోవడం, కరోనా కిట్లు అందుబాటులో లేకపోవడం, వైద్య పరికరాలు, మందులు రోగులకు సరిపడా అందుబాటులో లేకపోవడంపై జనసేన నాయకులు ఎన్టీఆర్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ కి వినతిపత్రం అందజేసి.. త్వరలో సమస్య పరిష్కరించని పక్షాన 15 రోజుల్లో జనసేన తరఫున భారీ ఎత్తున దీక్షకు దిగుతామని సూపరిండెంట్ గారికి తెలియ పరచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన టీం రామ దాసు గోవిందా, తాడి రామకృష్ణ, మల్ల శ్రీను, గొల్లవిల్లి రాజు పాల్గొన్నారు.