విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి: జనసేన

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రొద్దం మండలం నల్లూరు, గ్రామం, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యంలో బాగంగా తాగునీరు కూడా లేవు, తాగునీరు ప్రతి రోజూ హెడ్ మాస్టర్ స్కూలుకు వస్తూ పెనుకొండ నుండి 20లీటర్ల క్యాను తీసుకొని వస్తుంటారు. అలాగే స్కూల్ అవరణంలో వున్న మంచినీటి చేతి బోరు రిపేర్ చేయించాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం సీనియర్ నాయకులు జుబేర్. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.