రిమాండ్ కు చేరిన నూతన్ నాయుడు

శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నటుడు నూతన్ నాయుడును పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక కర్ణాటక ఉడిపి నుంచి విశాఖకు తీసుకువచ్చారు. కేజీహెచ్​లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. రిమాండ్​ విధించారు. నూతన్ నాయుడు సహా శిరోముండనం కేసులో మొత్తం అరెస్టయిన వారు 8 మంది ఉన్నారు. ఇది కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలోనూ నూతన నాయుడుపై కేసు నమోదైంది.