ప్రజా సమస్యలపై జనసేన తరఫున ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తాం.. రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట: ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్రం నుంచే జనసేన తరఫున ఇంకా బలంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తాం అని సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రోసనూరు సోమశేఖర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వేసిన వివాదాస్పద ఫ్లెక్సీలు చించివేతలో భాగంగా నాకోసం పోలీస్ స్టేషన్ కి వచ్చిన నా ప్రతి ఆత్మీయ సోదరులైన జనసైనికులకు, నాకు కాల్ చేసి అండగా నిలిచిన ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారికి, జనసేన పార్టీ లీగల్ సెల్ రాజేష్ గారికి, కిరణ్ గారికి మరియు జిల్లా నాయకత్వానికి, ఎన్.ఆర్.ఐ సోదరులకు, జనసైనికులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గారు నా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా ప్రజా సమస్యల దృష్ట్యా కచ్చితంగా ప్రజా క్షేత్రం నుంచే జనసేన పార్టీ తరఫున ఇంకా బలంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తాం. ముఖ్యంగా నాయుడుపేట పోలీసు డిపార్ట్మెంట్ వారికి సోమశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.