నాదెండ్ల మాట కాకినాడలో అందరి నోటా

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తాశశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ గారి మాట కాకినాడలో అందరి నోటా కార్యక్రమం శనివారం స్థానిక బాలా చెరువు వద్ద రాష్ట్ర సమితి కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి శివ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అక్రమాల్లో చిన్నపిల్లలని కూడా వదలలేదని నాడు-నేడు పనుల్లో గడిచిన 27 నెలల్లో 10% కూడా పూర్తి చేయలేకపోయారని, అలాగే సర్వ శిక్ష అభియాన్ లో కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా అని అలాగే కేంద్రం నుంచి పంపిన నిధుల్లో సుమారు 1800 కోట్లు దారి మళ్ళించారని అవినీతి విషయంలో విషయంలోని జగన్మోహన్ రెడ్డి దొంగలకు దొంగ అని, అతనికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక పక్కన అడ్డగోలుగా భూములు కేటాయిస్తూ మరొక పక్క దొరికిన కాడికి పథకాలలో సొమ్ముని అవినీతి రూపంలో తన అకౌంట్లో వేసుకుంటూ పైకి మాత్రం కపటి ప్రేమ వల్లిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం కలిపి ఖచ్చితంగా అధికారం చేపడతాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, మహమ్మద్ సమీర్, శంకర్, సుంకర సురేష్, మనోహర్లాల్ గుప్తా, వాసిరెడ్డి సతీష్, సాయి, శివాజీ యాదవ్, వరి పల్లి ప్రసాద్, వాసిరెడ్డి సత్య కుమార్, దుర్గాప్రసాద్, చీకట్ల వాసు, సతీష్, తుమ్మలపల్లి సీతారాం, వీరమహిళలు బోడపాటి సుజాత, దీప్తి, మిర్యాల హైమావతి, కాశ్మీర్ ఖాన్, వరద దొరబాబు, బద్ది శివ, వాడ్రేవు లోవరాజు, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.