మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలుగా ఒరుగంటి ప్రమీల

మర్రిపాడు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షురాలిగా ఒరుగంటి ప్రమీలను పార్టీ అధిష్టానం నియమించినట్లు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ విసయం తెలుసుకొన్న ప్రమీలా స్పందిస్తూ ఈ అవకాశం కల్పించినంటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు జనసేనపార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులుశ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లుకు జిల్లా కమిటీ సభ్యులకు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీధర్ కు ఒరుగంటి ప్రమీల కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా ప్రమీల మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడుతానని తన భర్తకు శ్రీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమని ఆయన అడుగుజాడల్లోనే నా పయనం సాగించి పార్టీ బలోపేతానికి ఇద్దరం కలిసి కృషి చేస్తామని తెలియజేసారు. మర్రిపాడు మండల జనసైనికులుకు పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు. ఎల్లప్పుడూ మండలంలోని జనసేవకుల అందరి నిర్ణయాలను గౌరవిస్తూ
జనసేన పార్టీ అదేశాలను పాటిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.