జగ్గయ్యపేట నియోజకవర్గంలో గ్రామ గ్రామన జనసేన పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం: బొలియశెట్టి శ్రీకాంత్

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు గ్రామంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ సమక్షంలో జనసేన పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు ప్రతి జనసైనికుడిని కలుపుకుని వెళ్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఇద్దరిని లాయర్ లుగా నియమిస్తాం అని వారు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిలు పండమనేని శ్రీనివాస్, బత్తిన హరి రాం, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని, మీకు అన్ని విధాలుగా జిల్లా టీం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు శివ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతలు నచ్చి 20 మంది యువకులు జిల్లా టీం వారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిసా మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, పుట్ట స్వరూప మండల అధ్యక్షులు తులసి బ్రహ్మమ్, తునికిపాటి శివ, రేగండ్ల వెంకటరామయ్య, పార్టీ శ్రేణులు వీరమహిళలు పాల్గొన్నారు.