మా మొదటి ఓటు జనసేన కే

తెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ సిటీ కళాశాల జనసేన విద్యార్థి విభాగం విద్యార్థి నాయకులు తమ మొదటి ఓటు జనసేన గాజు గ్లాసు కె వేస్తాం అని వెల్లడించారు. విద్యార్థుల కోసం జనసేన విద్యార్థి విభాగం పని చేస్తుందని భవిష్యత్తులో జనసేన విద్యార్థి విభాగం మరింత బలంగా ముందుకు వెళ్తుందని, కళాశాలలో చాలా మరమ్మతులు చేయాలని వాటిపై త్వరలో ఒక నివేదిక కూడా సమర్పిస్తాం అని ఆవిరేను వెంకటేష్ నేత (ఏ.వి.ఎం) చెప్పారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లను ప్రతి ఏటా ఆలస్యం చేస్తున్నారని, తమకి ఇతర రాజకీయ పార్టీలపై నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారిపై అభిమానం మాత్రమే కాదు నమ్మకం కూడా ఉందని తెలంగాణలో జనసేన ఎక్కడ నుండి పోటీ చేసిన విద్యార్థుల ఓట్లు అత్యధికంగా పడేటట్టు చేస్తాం అని ఏ.వి.ఎం అన్నారు. ఈ ఎన్నికలు ఫలితాలు తారుమారు చేసే సత్తా యువతకి మాత్రమే ఉంది అని ఏవిఎన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గోగులోత్ ధనుష్, మణికంఠ, ఆదిత్య యాదవ్, సూర్యకాంత్ నాయక్, ఆవిరేను వెంకటేష్ నేత, మరి కొద్దీమంది విద్యార్థులు పాల్గొన్నారు.