ఘనంగా పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు

కొండేపి, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో నందు మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. 2019 ఎలక్షన్ తరువాత నుండి ఇప్పటవరకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వెన్నంటే ఉండి ఒక సోదరుడిగా అండగా నిలబడినటువంటి నాదెండ్ల మనోహర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని త్వరలోనే మన అందరి కోరిక మేరకు అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల జనసేన పార్టీ కార్యాలయం. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశి భూషణ్, సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు, ఉప్పుటూరి రజిని, అనుములశెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, కిచ్చెంశెట్టి ప్రవీణ్, ప్రచార కార్యదర్శి, తగరం రాజు, కమిటీ మెంబర్స్, పోలిశెట్టి విజయ్ కుమార్, సయ్యద్ సుభాని, వీర మహిళలు, పోలిశెట్టి మాధురి, ఐనాబత్తిన రాధిక, మరియు జనసైనికులు పాల్గొన్నారు.