పవన్ కోసం పాదయాత్ర

రాజానగరం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్లో సీఎం అవ్వాలని రాజానగరం నియోజకవర్గ పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన సాయి అనే జనసైనికుడు కాలినడకన తిరుపతి వస్తానని ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని గురువారం పాదయాత్ర మొదలుపెట్టాడం జరిగింది. ఈ సందర్భంగా సాయిని అభినందిస్తూ రాజమండ్రి మున్సిపల్ స్టేడియం వద్ద శాటిలైట్ సిటీ జనసైనికులు చౌడాడ సునీల్, గోడిసిపూడి నాగేంద్ర, పోలూరి శ్రీను కలవడం జరిగింది. సాయి మొక్కుబడి నెరవేరాలని ప్రతి ఒక్క జనసైనికుడు కోరుకుందామని అన్నారు.