ధర్మవరం జనసేన నాయకుల పాదయాత్ర

మదనపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా జరగాలని అదేవిధంగా అధ్యక్షులవారు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని అలాగే రాష్ట్ర కార్యదర్శి మరియు ధర్మవరం జనసేన ఇన్చార్జ్ అయినటువంటి చిలకమ్మా రెడ్డి ఈసారి ఎన్నికలలో గెలవాలని ధర్మవరం జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మదనపల్లి చేరుకున్న వీరిని మదనపల్లి జనసేన నాయకులు ఆకుల శంకర, శ్రీనివాసులు, ఆకుల వెంకటేష్, రమణ, అమర తదితరులు ఆహ్వానించి వారికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున మద్దతు పలకడమైనది రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు ఉంటాదని అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలందరూ శిక్ష పరిపాలన చూస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.