గుడ్ మార్నింగ్ సిఎం సార్: జమ్ము

చీపురుపల్లి నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నున్న రోడ్లపై గుంతల విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు.. పిఎసి చైర్మన్ మనోహర్ నిర్ణయంతో.. యాష్ టాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరిట చేసే కార్యక్రమము చూసి అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి గార్కి మత్తు వదలరా.. నిద్దుర మత్తువదలరా… అని వారి కళ్ళు తెరిపించే అద్భుతమైన కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది.
చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకులు గరివిడి లో జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ…ఏపీ లో అధ్వాన రోడ్లు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి నుండి గర్భం వెళ్ళు రోడ్డు గరివిడి బస్స్టాప్ దగ్గర ఉన్న రోడ్డు అద్వాన్నంగా చెరువును తలపించే పరిస్థితి చూపిస్తూ… మీరు అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి శూన్యం అని మీ అంతరాత్మకు కూడా తెలుసు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్న వ్యక్తి గొప్పవాడు కానీ అబద్దం కూడా అంత ఈజీగా అవలీలగా మాట్లాడగలిగే ప్రపంచంలో ఏకైక వ్యక్తి మీరే ఆ విషయం మీకూ తెలుసు. మరీ ముఖ్యంగా రహదారుల పరిస్థితి మన గురించి పక్క రాష్ట్రపు వాళ్ళు మాట్లాడితే మీకు హేళన అనిపించలేదా.. మీరు బిత్తరచూపులు చూస్తారు. మన మంత్రివర్గం కుక్కలు వాగి నట్లు వాగుతారు. అలా కాకుండా వాళ్ళ ప్రజల ఓట్లతో గెలిచాము.. ప్రజలు రోడ్ల పై పడుతున్న ఇక్కట్లు చూస్తున్నాము.. అందుకు తగ్గట్టు నడుచుకోవాలని అభివృద్ధి మార్గాన్ని వెతకాలి అన్న ఆలోచన లేకపోవడం బాధాకర విషయం. సామాన్యుల నుంచి వసూలు చేస్తున్నా రోడ్ చెస్ ఏమౌతుంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జమ్ము ఆదినారాయణతో పాటు సిగా తవిటి నాయుడు,
సాసుబిల్లి రామునాయుడు డి. మోహన్ మరియు జనసైనికుల పాల్గొన్నారు.